Telugu tv
ఏప్రిల్ 9,ఏప్రిల్ 23,ఏప్రిల్ 29 తేదీల్లో ఎన్నికలు
మే 4న కౌంటింగ్
నాలుగు రాష్ట్రాలతో సహా
పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు
ఎన్నికల షెడ్యూల్ విడుదల

దేశంలోని అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో సహా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
ఆదివారం చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ కుమార్ ఎన్నికల జరిగే తేదీలను ప్రకటించారు.
అస్సాం, కేరళం లోని అన్ని నియోజకవర్గాలకు ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 9న ఎన్నికల నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9 న ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడులో ఉన్న 234 నియోజక వర్గాలకు ఒకే విడత లో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశ ఏప్రిల్ 23 రెండో దశ ఏప్రిల్ 29న జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరిగే ఎన్నికల కౌంటింగ్ మే 4న నిర్వహించనున్నారు.అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.

